భూకంపం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ఇప్పటికే దేశ రాజధాని భూకంపంతో వణికిపోయింది... మళ్లీ భూమి కంపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో భూకంప సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
1. భూమి కంపించగానే ఎక్కడ ఇళ్లు కూలిపోతుందోనని చాలామంది బయటకు పరుగు తీస్తారు. కానీ భూకంప సమయంలో ఇంట్లో ఉండటమే సేఫ్... భయటే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యుత్ స్తంభాలు కూలడం,విద్యుత్ తీగలు తెగిపడటం, వాహనాలు అదుపుతప్పడం, హోర్డింగ్ లు వంటివి కుప్పకూలి ప్రమాదం జరగవచ్చు... కాబట్టి ఇంట్లోనే ఉండి బలమైన బల్లకిందో, మంచంకింద దూరడమో చేయాలి.
2. ఇక భయట ఉన్నపుడే భూకంపం సంభవిస్తే వెంటనే దగ్గరున్న సురక్షిత ప్రాంతంలోకి వెళ్ళాలి. విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్, పెద్ద భవనాలు, చెట్లకు దూరంగా ఉండాలి. ఖాళీగా ఉండే ప్రాంతాల్లోనే వేచివుండాలి.
3. డ్రైవింగ్ లో ఉంటే వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కన ఆపాలి. చెట్లు, స్తంభాలు లేనిప్రాంతంలో వాహనాన్ని నిలపాలి.
4.అపార్ట్ మెంట్స్, పెద్దపెద్ద భవంతుల్లో నివాసం ఉండేవారు భూకంప సమయంలో కంగారుపడి బయటకు పరుగు తీయవద్దు... ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా లిప్ట్ ఎక్కడం అస్సలు చేయకూడదు.
5. భూకంపాల సమయంలో పొలాల వద్ద వుండే రైతులు చెట్లకు దూరంగా వుండాలి. మైదాన ప్రాంతంలో వుండటమే సురక్షితం... భూప్రకంపనల కారణంగా చెట్లు బలహీనపడి కూలిపోయే అవకాశం వుంటుంది. కాబట్టి భూకంప సమయంలో చెట్లకింద ఉండటం అంత సేఫ్ కాదు.
ఇవి కూడా చదవండి
తెలుగు రాష్ట్రాల్లో పదేపదే భూకంపాలు ఎందుకు వస్తున్నాయి