మరో విమానం..
ఇదిలా ఉంటే మరో విమానం భారత్లో ల్యాండ్ కానుంది. 157 మందితో కూడిన విమానం ఆదివారం అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కానుంది. వీరిలో 59 మంది హర్యానాకు, 52 మంది పంజాబ్కు, 31 మంది గుజరాత్కు చెందినవారు ఉన్నారు. అయితే ఈ ప్రాసెస్ ఇంకా కొనసాగనుందని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం సుమారు 500 మంది అక్రమంగా ఆ దేశంలో ఉంటున్నట్లు గుర్తించినట్లు. త్వరలోనే వారిని భారత్కు తిరిగి పంపించనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎవరిని పంపిస్తున్నారు.?
అమెరికాలో సరైన పత్రాలు లేకుండా, గడువు ముగిసిన వీసాలతో నివసిస్తున్న వారిని తమ తమ దేశాలకు పంపిస్తున్నారు. అలాగే విద్యార్థి వీసాలపై వెళ్లి అక్కడే ఉండిపోతున్న వారిని. అక్రమ మార్గాల్లో అమెరికాలోకి వెళ్లిన వారిని తరలిస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల నిఘా కఠినతరం చేశారు. వారి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారి జాబితాను సిద్ధం చేసి వారి వారి దేశాలకు పంపిచేస్తున్నారు.
అమృత్సర్లోనే ఎందుకు.?
ఇదిలా ఉంటే అమెరికా నుంచి వస్తున్న విమానాలు పంజాబ్లోని అమృత్సర్లోనే ల్యాండ్ అవుతుండడంపై రాజకీయ వివాదం నెలకొంది. ఈ విమానాలను కావాలనే కేంద్ర ప్రభుత్వం అమృత్సర్లో ల్యాండ్ చేస్తోంది. పంజాబ్ ఇమేజ్ను దెబ్బ తీసేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్మాన్సింగ్ విమర్శించారు.
అయితే ఈ విమర్శల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని చెబుతోంది. అమెరికా నుంచి ఇండియాకు ఎయిర్ రూట్ను గమనిస్తే భారత్లో నియరెస్ట్ ఎయిర్ పోర్ట్ పంజాబ్లోని అమృత్సర్లో ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే పంజాబ్ దీనిపై ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.