CJP: ఇది మొద‌టి వికెట్ మాత్ర‌మే.. పోరాటం ఇంకా ఉంది. కాక్రోచ్ పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న

Published : Jul 25, 2026, 04:45 PM IST

CJP: కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) పేరుతో మొద‌లైన విద్యార్థి ఉద్యమం అనుకున్న‌ది సాధించింది. నీట్ పేప‌ర్ లీక్‌కు బాధ్య‌తవ‌హిస్తూ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థి లోకం దండెత్త‌గా ఎట్ట‌కేల‌కు మంత్రి రాజీనామా చేశారు.

PREV
15
విద్యార్థుల ఉద్యమానికి కీలక ఫలితం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామాన్ని విద్యార్థి ఉద్యమం సాధించిన విజయంగా పేర్కొంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) హర్షం వ్యక్తం చేసింది. పార్టీ అధికారిక సోషల్ మీడియాల్లో "ఇది ఒక్క నాయకుడి విజయం కాదు.. దేశంలోని ప్రతి విద్యార్థి గెలిచిన రోజు" అని పేర్కొంది. ప్రధాన్ రాజీనామా వార్త వెలువడిన వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. నినాదాలతో అక్కడి వాతావరణం మార్మోగింది. ఈ విజయాన్ని ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనంగా సీజేపీ నేతలు అభివర్ణించారు.

25
శాంతియుత పోరాటమే బలం.. అభిజీత్ దీప్కే స్పందన

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ శాంతియుత నిరసనల ద్వారా కూడా ప్రభుత్వాలను నిర్ణయాలు మార్చేలా చేయవచ్చని ఈ ఉద్యమం నిరూపించిందన్నారు. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గమే తమకు స్ఫూర్తి అని చెప్పారు. "యువత గళం వినిపిస్తే ప్రజాస్వామ్యంలో మార్పు సాధ్యమే. ఈ విజయం ఏ రాజకీయ పార్టీది కాదు. దేశ భవిష్యత్తు కోసం పోరాడిన విద్యార్థులది" అని ఆయన పేర్కొన్నారు. అయితే తమ పోరాటం ఇక్కడితో ముగిసిపోలేదని స్పష్టం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవడం, ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను పూర్తిగా ఉపసంహరించడం, విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు చేపట్టడం, ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థుల‌కు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా వంటి డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. అదే ఉద్దేశంతో కొవ్వొత్తుల ర్యాలీకి కూడా పిలుపునిచ్చారు.

35
ఎవ‌రీ అభిజీత్ దీప్కే ఎవరు?

సీజేపీ ఆవిర్భావం వెనుక ప్రధాన లక్ష్యం విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రశ్నించడం. కేవలం రెండు నెలల క్రితమే అభిజీత్ దీప్కే ఈ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు. సోషల్ మీడియాలో వేగంగా గుర్తింపు పొందిన ఈ సంస్థ, నీట్‌ పేపర్‌ లీక్‌ అంశాన్ని కేంద్రంగా చేసుకుని విద్యార్థులను ఒకే స్టేజ్ పైకి తీసుకురావడంలో విజయవంతమైంది.

జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అనేక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా మద్ధతు తెలపడంతో ఉద్యమానికి మరింత బలం చేకూరింది. అనంతరం నిర్వహించిన "చలో పార్లమెంట్" కార్యక్రమం సైతం దేశం దృష్టిని ఆక‌ర్షించింది. 30 ఏళ్ల అభిజీత్ దీప్కే మహారాష్ట్రలోని పుణెలో జర్నలిజం అభ్యసించారు. అనంతరం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. సామాజిక అంశాలపై చురుకైన ప్రచారకర్తగా ఆయనకు గుర్తింపు ఉంది.

45
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

మంత్రి రాజీనామా తమ డిమాండ్లలో ఒకటి మాత్రమే నెరవేరిందని సీజేపీ చెబుతోంది. ఇకపై తమ దృష్టి విద్యా వ్యవస్థలో పారదర్శకత పెంపుపై ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, పరీక్షా భద్రతను బలోపేతం చేసే విధానాలు, బాధ్యత వహించే అధికారులపై కఠిన చర్యలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టపరమైన చర్యలపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ భావిస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యా నిపుణులతో కలిసి విస్తృత స్థాయి చర్చలు నిర్వహించి విద్యా సంస్కరణల కోసం కార్యాచరణ రూపొందించే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

55
ఒక్క నీట్‌తోనే ఆగిపోతుందా?.. వ్యవస్థలోని లోపాలపై సీజేపీ పోరాటం కొనసాగుతుందా?

నీట్ పేపర్ లీక్ ఉద్యమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సీజేపీ ఇకపై కేవలం ఒకే అంశానికి పరిమితమవుతుందా, లేక ప్రజా సమస్యలను ప్రశ్నించే విస్తృత ఉద్యమంగా మారుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం ఇప్పటివరకు చేసిన ప్రకటనలను పరిశీలిస్తే, విద్యా రంగంలో పారదర్శకత, ప్రభుత్వ నియామక పరీక్షల నిర్వహణ, అవినీతి, పరిపాలనా వైఫల్యాలు వంటి వ్యవస్థాగత సమస్యలపై కూడా తమ పోరాటాన్ని విస్తరించాలని సంకేతాలు ఇస్తోంది. అయితే ఉద్యమ పార్టీగా కొనసాగుతుందా, లేక ఎన్నికల రాజకీయాల్లోకి కూడా అడుగుపెడుతుందా అన్న అంశంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. నీట్ లీక్ అంశం ద్వారా విద్యార్థుల్లో ఏర్పడిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, తమ ఉద్యమాన్ని దీర్ఘకాలిక ప్లాట్ ఫామ్ గా మార్చుకోవడం సీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్‌గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే నెలల్లో పార్టీ చేపట్టే కార్యక్రమాలే దాని భవిష్యత్ దిశను నిర్ణయించే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories