మన అత్యాశే నేరగాళ్లకు వరంగా మారుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి. పనిలేకుండా డబ్బు రావాలి.? ప్రజలకు ఉండే ఇలాంటి అత్యాశను పెట్టుబడిగా మార్చుకొని కొందరు నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
అసలు ఊహకు కూడా అందని విధంగా నేరాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు హనీట్రాప్, స్టాక్మార్కెట్, డిజిటల్ అరెస్ట్లు, ఓటీపీ ఫ్రాడ్స్ లాంటివి మాత్రమే విన్నాం అయితే తాజాగా బిహార్లో సరికొత్త మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది.