పాన్ కార్డు షాక్: ఎస్పీ నేత అజం ఖాన్, కుమారుడు అబ్దుల్లాకు ఏడేళ్ల జైలు శిక్ష

Published : Nov 17, 2025, 05:00 PM IST

PAN Card Case : డబుల్ పాన్ కార్డు కేసులో ఎస్పీ నేత అజం ఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాకు రాంపూర్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన మళ్లీ జైలుకెళ్తున్నారు.

PREV
14
పాన్ కార్డు కేసు: అజం ఖాన్‌–అబ్దుల్లాకు కఠిన శిక్ష

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత అజం ఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంపై రాంపూర్ కోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. నకిలీ పాన్ కార్డులు పొందిన కేసులో ఇద్దరినీ దోషులుగా నిర్దారించిన కోర్టు, వారికి ఏడు ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50,000 చొప్పున జరిమానా విధించింది. తీర్పు ప్రకటించగానే పోలీసులు వారిని కోర్టు పరిధిలోనే అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసు 2019లో నమోదు అయినప్పటికీ, 2017 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ల సమయంలో పుట్టిన తేదీ మార్పులపై వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభమైంది.

24
పుట్టిన తేదీలు మార్చి రెండు పాన్ కార్డులు

అబ్దుల్లా ఆజం అసలు పుట్టిన తేదీ జనవరి 1, 1993. ఈ బర్త్ డే ప్రకారం, ఆయన 2017 ఎన్నికల్లో పోటీ చేయడానికి వయోపరిమితి పూర్తికాలేదు. కానీ, ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించే క్రమంలో 1990 సెప్టెంబర్ 30న జన్మించినట్లు చూపే మరో పాన్ కార్డు ఉపయోగించారని బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఆరోపణలతో అజం ఖాన్, అబ్దుల్లా కలిసి నామినేషన్ పత్రాల్లో అబ్దుల్లా వయసును దాచేందుకు నకిలీ పత్రాలు ఉపయోగించారని కోర్టులో సాక్ష్యాలు సమర్పించారు. ఈ ఆధారాలను పరిశీలించిన అనంతరం వారికి పలు సెక్షన్ల కింద శిక్షలు విధించారు.

34
104 కేసుల్లో ఏడోసారి దోషిగా అజం ఖాన్

అజం ఖాన్‌పై ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 104 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఇప్పటికే 12 కేసుల్లో తీర్పులు వచ్చాయి. 7 కేసుల్లో ఆయన దోషిగా తేలగా, 5 కేసుల్లో నిర్దోషిగా తప్పించుకున్నారు. తాజాగా వచ్చిన ఈ తీర్పు, ముఖ్యంగా డబుల్ పాన్ కార్డు కేసులో శిక్షపడటం, ఆయనకు రాజకీయపరంగా తీవ్రమైన దెబ్బ అని చెప్పాలి.

సీతాపూర్ జైలులో దాదాపు 23 నెలల జైలు జీవితం గడిపిన అజం ఖాన్, ఇటీవలే బయటికి వచ్చినప్పటికీ, ఇప్పుడు మళ్లీ కటకటాల వెనుకకు వెళ్లాల్సి ఉంటుంది.

44
కోర్టు తీర్పుపై ఆకాశ్ సక్సేనా ఏమన్నారంటే?

ఈ కేసును మొదటగా ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా, తీర్పును స్వాగతించారు. “తీర్పు నిజానికి అక్రమాలపై విజయం. అజంపై ఉన్న ప్రతి కేసూ పత్రాల ఆధారంగానే ఉంది. నేరం చేసిన ఎవరైనా సరే శిక్షను అనుభవించాల్సిందే” అని ఆయన పేర్కొన్నారు. వారి ఫిర్యాదు ఆధారంగానే సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

ఎస్పీ వ్యూహకర్తగా అజం ఖాన్ ప్రస్థానం

అజం ఖాన్ ఎస్పీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మైనారిటీ వర్గాల గళంగా గుర్తింపు పొందిన ఆయన, పలు దశల్లో మంత్రిగా పనిచేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉండేది. ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వాల్లో ఆయన కీలక నాయకుడిగా వ్యవహరించారు.

అయితే, వరుస కేసులు, లీగల్ సమస్యలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజా తీర్పుతో ఆయన, ఆయన కుమారుడు అబ్దుల్లా మళ్లీ జైలుకు చేరడం ఎస్పీకే కాదు, యూపీ రాజకీయాలకు కూడా కీలక పరిణామంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories