కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏ స్థాయిలో పెరుగుతాయి...
2014 ఫిబ్రవరి 7వ వేతన సంఘాన్ని ఏర్పాటుచేసారు... ఇది దాదాపు రెండేళ్లపాటు ఉద్యోగాల జీతాలు, పెన్షన్ పై స్టడీ చేసింది. దీని సిపారసులు 2016 ను ఆధారంగానే 2016 జనవరి 1 నుండి అమలులోకి వచ్చాయి. ఈ వేతన సంఘం సిపార్సులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి.
2016 కు ముందు కనీస వేతనం రూ.7000 వున్న ఉద్యోగులకు 8వ వేతనసంఘం సిపార్సుల ప్రకారం రూ.18,000 కు చేరింది. ఇప్పుడు కూడా ఇదేస్థాయిలో జీతాలు పెరుగుతాయని సెంట్రల్ ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లే తాజా పే కమీషన్ 2.86 పిట్ మెంట్ ఇస్తే జీతం అమాతం పెరిగిపోతుంది. ఇప్పుడు కనీస వేతనం రూ.18,000 కాస్త రూ.51,480 అవుతుంది.
ఇక వేతన సంఘం ఏర్పాటుతో పించను కూడా భారీగా పెరిగే అవకాశాలుంటాయి. ఇప్పుడు కనీస పెన్షన్ రూ.9000 వుంటే నూతన పే కమీషన్ సిపార్సులతో అదికాస్త రూ.25,740 కి చేరే అవకాశం వుంది.
ఈ 8వ వేతన సంఘం సిపార్సులు తమకు ఆర్థికంగా బాగా లబ్ది చేకూరుస్తాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. సాలరీతో పాటు అలవెన్సులు కూడా భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలు బాగా పెరుగుతున్నాయి... కాబట్టి భవిష్యత్ 10 ఏళ్లను దృష్టిలో వుంచుకుని వేతన సంఘం సిపార్సులు వుండాలని ఉద్యోగులు కోరుతున్నారు.