1966లో పంజాబ్ నుండి 'హర్యానా' ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మన తెలుగు రాష్ట్రాలు విడిపోయినట్లే పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. అయితే.. విభజన తర్వాత చండీగఢ్ మాదంటే మాదని ఇరు రాష్ట్రాలూ పట్టుబట్టాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారం కనుగొంది. చండీగఢ్ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా (UT) ప్రకటిస్తూ, రెండింటికీ ఉమ్మడి రాజధానిగా చేసింది. పంజాబ్ గవర్నరే చండీగఢ్ నగర ప్రధాన పాలకుడిగా (అడ్మినిస్ట్రేటర్) వ్యవహరిస్తారు.
చండీగఢ్ లో చూడాల్సిన ప్రదేశాలు..
రాక్ గార్డెన్: 'నెక్ చంద్' అనే వ్యక్తి పగిలిన గాజులు, పాత సెరామిక్ పాత్రలు, విసిరేసిన వ్యర్థ పదార్థాలతో ఈ గార్డెన్ను చాలా అద్భుతంగా నిర్మించారు.
సుఖ్నా లేక్: కొండల దిగువన ఉండే ఈ సరస్సు సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడపడానికి ఎంతో బాగుంటుంది.
ఓపెన్ హ్యాండ్ శిల్పం: లీ కార్బుసియర్ డిజైన్ చేసిన ఓపెన్ హ్యాండ్ శిల్పం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. గ్రీన్ సిటీ: దేశంలోనే అత్యధిక పచ్చదనం, పరిశుభ్రత , క్రమశిక్షణ కలిగిన రోడ్లు ఉన్న నగరాల్లో ఇది ఒకటి.