రైళ్లలో కొబ్బరికాయ తీసుకువెళ్తే ఏమౌతుంది అని అనుకోవచ్చు. అయితే.. నిజానికి కొబ్బరితో ఎలాంటి సమస్య లేదు. కానీ.. దానిపైన ఎండిపోయిన పీచు, ఎండు కొబ్బరిలో ఉండే నూనెతోనే అసలు సమస్య. ఎందుకంటే…ఎండు కొబ్బరి పీచు చాలా త్వరగా మంటలను పట్టుకుంటుంది. చిన్న నిప్పురవ్వ పడినా ఇది క్షణాల్లో అంటుకుంటుంది.
బోగీల్లో పెను ప్రమాదం: ప్రయాణికులు, లగేజీతో కిక్కిరిసిపోయే రైలు బోగీల్లో ఎండు కొబ్బరి వల్ల మంటలు చెలరేగితే.. అది చాలా వేగంగా వ్యాపించి పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది.
డేంజరస్ లగేజ్ జాబితా: అందుకే రైల్వే శాఖ గ్యాస్ సిలిండర్లు, కిరోసిన్, బాణసంచా , రసాయనాలతో పాటు 'ఎండు కొబ్బరి'ని కూడా ప్రమాదకరమైన వస్తువుల జాబితాలో చేర్చింది.