హిందూ సంప్రదాయంలో సింధూరానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పెళ్లైన మహిళలు పాపిట్లో సింధూరం పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కొంతమంది సింధూరం పెట్టుకుంటే.. మరికొందరు కుంకుమను పెట్టుకుంటారు. ఎరుపు రంగు.. శక్తి, శుభం, ప్రేమకు గుర్తుగా భావిస్తారు. భర్తకు మంచి ఆయుష్షు, కుటుంబంలో సుఖసంతోషాలు ఉండాలని కోరుకుంటూ స్త్రీలు సింధూరం ధరిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే సింధూరం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా వివాహ బంధానికి గుర్తుగా కూడా భావిస్తారు.