ప్రయాణికుడు చనిపోయిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయరు.విమానం ఎక్కడ ఉంది? ఎంత దూరం ప్రయాణించాలి? అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, వైద్యుల సలహా మేరకు కెప్టెన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.విమానం ల్యాండ్ చేసిన తర్వాత, మొదట ఇతర ప్రయాణికులను సురక్షితంగా దించుతారు. ఆ తర్వాత సంబంధిత అధికారుల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీస్తారు.
అలా కాకుండా, ప్రయాణికుడు బతకడానికి చిన్న అవకాశం ఉన్నా.. విమానాన్ని సమీపంలోని విమానాశ్రయంలో ఎమర్జెనీ ల్యాండింగ్ చేస్తారు. అలా కాకుండా విమానంలోనే ప్రాణాలు కోల్పోతే వీలైనంత వరకు అత్యవసర ల్యాండింగ్ చేయరు. విదేశాల్లో ల్యాండింగ్ చేయాల్సి వస్తే.. మృతదేహాన్ని అక్కడే దించాల్సి వస్తుంది. దీని వల్ల పోస్టుమార్టం సహా, చాలా లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే.. గమ్యస్థానం వచ్చే వరకు డెడ్ బాడీని విమానంలోనే ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
విమానం ల్యాండ్ కావడానికి ముందు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి తెలియజేస్తారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత, వైద్య బృందాలు , పోలీసులు విమానంలోకి ప్రవేశించి తనిఖీలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే మృతదేహాన్ని కిందకు దించుతారు.