మగవారితో పోలిస్తే ఆడవారికే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో బలపాలను తినడం కూడా ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వారు చిన్నప్పుడు బలపాలను తిన్న దాని ఫలితమే ఇది.
బలపాలను తింటే జీర్ణ సమస్యలు, రక్తహీనత వస్తాయి. అలాగే బలపాలను తినడం వల్ల ప్రభావితమయ్యే మొదటి అవయవం మూత్రపిండాలు. అలాగే దీన్ని తినడం వల్ల డయేరియా, రుతుస్రావం ఆలస్యం కావడం, కడుపులో కణితులు వంటి సమస్యలు కూడా వస్తాయి.
అలాగే బలపాలను తినడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. కాలక్రమేణా దంతాలు అనారోగ్యం బారిన పడతాయి. అంతేకాదు దీని వినియోగం దవడపై ప్రభావం చూపుతుంది. ఇది దవడలో నొప్పిని కలిగిస్తుంది.