బరువు పెరిగేందుకు అరటిపండును మధ్యాహ్నం పూట కూడా తినొచ్చు. ఇందుకోసం పెరుగు, అరటిని కలిపి తినండి. దీనివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ కాంబినేషనల్ అరటిని తీసుకుంటే.. ఫుడ్ తొందరగా అరుగుతుంది. జీవక్రియ రేటుకు కూడా పెరుగుతుంది. అయితే అరటిలో కొద్దిగా పెరుగును వేసి జ్యూస్ గా తయారుచేయాలి. దీనిలో యాలకుల పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ ను మిక్స్ చేసి తాగితే.. మీ ఆరోగ్యం బాగుంటుంది. బలం కూడా పెరుగుతుంది.