Pets in Train: ఇక నుంచి మీ పెంపుడు జంతువులు కూడా మీతో రైలు ఎక్కొచ్చు.. ఎలానో తెలుసా?

Published : Jun 26, 2026, 05:12 PM IST

 Pets in Train: ఇప్పటి వరకు వందే భారత్ రైలులో మీరు ప్రయాణించి ఉండొచ్చు. ఇక నుంచి మీతో పాటు మీ పెంపుడు జంతువులను కూడా హ్యాపీగా వెంట తీసుకెళ్లొచ్చు. అందుకు తగినట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

PREV
13
Pets in Train

వందే భారత్ స్లీపర్ రైలులో పెంపెండు జంతువుల కోసం స్పెషల్ సదుపాయం తీసుకువచ్చారు. పెంపుడు జంతువులు ఉన్నవారికి ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే...వారు ప్రయాణాలు చేయాల్సిన ప్రతిసారీ.. వాటిని తీసుకువెళ్లడం కుదరక.. ఎవరో ఒకరు ఇంట్లో వాటికోసం ఆగిపోతూ ఉంటారు. లేదంటే..వాటిని వేరే ఇంకెక్కడైనా ఉంచేస్తూ ఉంటారు. అయితే.. ఇక నుంచి ఆ అవసరం లేదు.. మీరు వందే భారత్ లో ప్రయాణిస్తే.. వాటిని మీతో పాటు తీసుకువెళ్లొచ్చు. అందుకు వీలుగా ఇండియన్ రైల్వే ఓ ప్రత్యేక సదుపాయాన్ని తీసుకువచ్చింది.

23
మీ పెట్స్ తో ప్రయాణం...

వందే భారత్ స్లీపర్ రైలులో పెంపుడు జంతువుల కోసం పెట్ బాక్స్ సౌకర్యం ఉంది. నివేదికల ప్రకారం, పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక, సురక్షితమైన ఓ స్థలాన్ని కేటాయిస్తారు. ఈ బాక్సులు రైలుకు ఇరువైపులా లోకో మోటివ్ దగ్గర ఉంటాయి. అయితే, ఈ సౌకర్యాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకోలేరు. రైల్వే స్టేషన్ కి వెళ్లి మీరు ఈ పెట్ బాక్స్ ని బుక్ చేసుకోవచ్చు.

ఈ సదుపాయం పొందాలంటే.. ప్రయాణికులు తాము బయలుదేరే స్టేషన్ లోని పార్సెల్ లేదా లగేజ్ కార్యాలయాన్ని సందర్శించాలి. అక్కడ ఉన్న అధికారి మీ కుక్క లేదా పిల్లి కోసం ఒక పెట్ బాక్స్ ను బుక్ చేస్తారు. రైలు బయలు దేరడానికి కనీసం మూడు గంటల ముందే.. మీరు ఈ బాక్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

33
ప్రయాణికుల టికెట్ తప్పనిసరి..

వందే భారత్ స్లీపర్ రైలులో పెట్ బాక్స్ బుక్ చేసుకోవాలంటే... ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ తప్పనిసరిగా ఉండాలి. ఆర్ఏసీ, వెయిటెడ్ లిస్ట్ లో ఉన్న టికెట్లకు ఈ పెట్ బాక్స్ సదుపాయాన్ని అందించరు. అదనంగా, ప్రయాణికులు తమ పెంపుడు జంతువుకు సంబంధించిన ఇటీవలి వెటర్నరీ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అందించాలి. అది కూడా ప్రయాణానికి 48 గంటల లోపు వెటర్నరీ డాక్టర్ ఇచ్చింది అయ్యి ఉండాలి. అంతేకాకుండా..వాటికి రీసెంట్ గా వేసిన వ్యాక్సిన్ రికార్డు కూడా అందించాలి. పెట్ బాక్స్ ధర మీ పెట్ బరువు ఆధారంగా నిర్ణయిస్తారు. కిలోకి రూ.30 చొప్పున లెక్కిస్తారు. పెట్ బాక్స్ బుకింగ్ కన్ఫామ్ అయితే.. మీ లగేజ్ టికెట్ రూపంలో ఇస్తారు.

క్యాబిన్‌ల లోపలికి అనుమతి లేదు

ఈ సౌకర్యం కింద, పెంపుడు జంతువులను రైలు బోగీకి రెండు చివర్లలోని నిర్దిష్ట ప్రదేశాలలో ఉంచుతారు. పెంపుడు జంతువులను ప్రయాణీకుల క్యాబిన్‌లలోకి అనుమతించరు. ముఖ్యంగా, పెట్ బాక్స్ బుకింగ్ రుసుము వాపసు ఇవ్వరు. ఒక PNRకు ఒక పెంపుడు జంతువును మాత్రమే అనుమతిస్తారు. అందువల్ల, ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా, ఈ సేవ అన్ని మార్గాలలో అందుబాటులో ఉండకపోవచ్చు, కాబట్టి ప్రయాణీకులు తాము వెళ్లే రైలుకి ఈ సర్వీస్ ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories