మాంసం తినేవారితో పోలిస్తే చేపలు తినేవారిలో మరణాల రేటు (Mortality Rate) తక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఎందుకంటే ఊబకాయం వల్ల వచ్చే గుండె జబ్బులు, పక్షవాతం, కొన్ని రకాల క్యాన్సర్లు చేపల వల్ల రావు. దీని వల్ల మనిషి ఆయుష్షు కూడా పెరుగుతుంది.
చేపలను నూనెలో డీప్ ఫ్రై చేయకుండా, ఉడకబెట్టి లేదా గ్రిల్ చేసి తింటే మంచిది. అయితే మాంసం మాత్రం పూర్తిగా మానేస్తేనే ఉత్తమం. పెద్ద చేపల్లో పాదరసం (Mercury) ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, చిన్న చేపలను ఎంచుకుని వారానికి 2-3 సార్లు తినడం మంచిది. చేపలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు కూడా తీసుకోవాలి.