ఆయిలీ ఫుడ్, కారంగా ఉండే ఆహారాలను తినడం మానుకోండి
జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మనం తినే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే వీలైనంత వరకు కారం, ఆయిలీ ఫుడ్స్ ను ఎక్కువగా తినకండి. ఎందుకంటే వీటిని తినడం వల్ల ఎసిడిటీ, మలబద్దకం, విరేచనాలు వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే మీరుతినే వంటల్లో కారాన్ని ఎక్కువగా వేయకండి. ఆకుకూరలు, పాలు, పెరుగు, కాయధాన్యాలను ఎక్కువగా తినండి. ఇవి మీ కడుపును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎసిడిటీ సమస్య కూడా పోతుంది.