అన్నంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొంతమందిలో అజీర్తి లేదా కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అన్నం ఉడికేటప్పుడు బిర్యానీ ఆకు వేయడం వల్ల, అందులోని రసాయన సమ్మేళనాలు అన్నంతో కలుస్తాయి. ఇవి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఇది గ్యాస్, అసిడిటీ సమస్యలను దూరం చేస్తుంది.
బిర్యానీ ఆకులో విటమిన్-ఎ, విటమిన్-సి, ఐరన్, పొటాషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అన్నం వండేటప్పుడు ఆకులోని పోషకాలు అన్నంలోకి చేరి, మనం తినే ఆహారాన్ని పోషకాలతో నిండేస్తాయి.