Health Tips: తిన్న తర్వాత ఈ మిస్టేక్స్ చేస్తే మీ పని అంతే..

Published : Jan 31, 2022, 10:19 AM IST

Health Tips: ఈ గజిబిజీ లైఫ్ లో ఎవరూ కూడా తమ ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టడమే మర్చిపోయారు. దాని ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కానీ ఆహారం విషయంలో ఎంత కేరింగ్ తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతాం. లేదంటే..

PREV
15
Health Tips: తిన్న తర్వాత ఈ మిస్టేక్స్ చేస్తే మీ పని అంతే..


Health Care Tips: ఈ గజిబిజీ లైఫ్ లో ఏ ఒక్కరు కూడా తమ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే లేదు. దాని మూలంగానే నేడు ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది. తినే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అనేక అనారోగ్యాలు మనల్ని చుట్టుకునే ప్రమాదం ఉంది. వ్యక్తిగత జీవితంలో నిమగ్నమై తమ ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తే.. అది మనపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. అందుకే కదా మధుమేహం, థైరాయిడ్, రక్తపోటు వంటి ప్రమాదకర జబ్బుల పాలవుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో పౌష్టిక విలువలతో కూడుకున్నదైతే.. ఎటువంటి రోగాలు రావు. అంతేకాదు ఎంతో ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండగలుగుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కొన్ని రకాల ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి తీవ్రంగా హానిచేస్తాయి. అటువంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తిన్న తర్వాత కొన్ని రకాల ఆహారం తీసుకుంటే.. ఎన్నో అనారోగ్య సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎలాంటి ఆహార పదార్థాలను తిన్న తర్వాత తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
 

25


టీ, కాఫీ: కొంతమంది టీ లేదా కాఫీని ఏదైనా ఆహారం తీసుకోకముందే తాగుతుంటారు. కానీ మరికొంత మంది ఆహారం తీసుకున్న తర్వాతే టీ, కాఫీని తాగుతుంటారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. తిన్న తర్వాత టీ తాగితే .. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల బారిన పడే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ లేదా కాఫీ తాగిన గంట తర్వాత లేదా గంట ముందు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే టీ లో ఉండే టానిన్ అనే రసాయనం ఐరన్ absorption process కు అడ్డుగా నిలుస్తుంది. దీని వల్ల తీవ్రమైన తలనొప్పి, రక్తహీనత, కాళ్లు చేతుల నొప్పులు వస్తాయి. అంతేకాదు ఇది మన ఆకలి మందగించేలా చేస్తుంది. 

35

ఆల్కహాల్: తిన్న వెంటనే ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. ఎందుకంటే తిన్న తర్వాత మద్యం తాగితే అది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. అంతేకాదు ప్రేగులపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే భోజనం చేయడానికి ఒక 30 నిమిషాల ముందు మందును తాగకూడదు. అలాగే భోజనం చేసిన 1 లేదా రెండు గంటల వరకు మద్యం తాగకూడదు

45

భోజనం చేసిన తర్వాత చాలా మందిని నీళ్లను బాగా తాగుతుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే తిన్నవెంటనే నీళ్లను తాగితే కడుపులో సమస్యలు వచ్చి అది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపెడుతుంది. తిన్నవెంటనే కాకుండా 30 లేదా 45 నిమిషాల గ్యాప్ తర్వాత నీళ్లను బేషుగ్గా తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

55

పండ్లు: భోజనం చేసిన తర్వాత చాలా మంది పండ్లను తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ అది మంచి పద్దతి కాదు. భోజనం చేసిన తర్వాత లేదా అల్పాహారం తర్వాత పండ్లను తింటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు పండ్లను ఖాళీ కడుపున తింటే ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories