సాయంత్రం సమయంలో టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా టీ తాగేటప్పుడు బజ్జీలు, కారప్పూసలు వంటివి తినేవారు ఎంతో మంది. తింటున్నప్పుడు టేస్టీగానే ఉంటుంది… కానీ ఇందులో నూనె, పిండి, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తరచుగా తినడం వల్ల బరువు పెరగడం, కొలెస్ట్రాల్ అసమతుల్యత, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.