ఈ నది మన దేశంలోనే ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సమయంలో ఉన్న బటేశ్వర్ అనే ఈ ప్రముఖ దేవాలయం వద్ద ఇది కనిపిస్తుంది. ఇక్కడ ప్రవహించే పవిత్రా యమునా నది.. ఇతర నదుల్లా కాకుండా.. వెనక్కి ప్రవహిస్తూ ఉండటం విశేషం.
సాధారణంగా యమునా నది ఉత్తరం నుంచి దక్షిణ-తూర్పు (South-East) దిశగా సాగుతుంది. కానీ బటేశ్వర్ వద్దకు రాగానే నది ఒక్కసారిగా మలుపు తిరిగి వాయువ్య (North-West) దిశగా ప్రవహిస్తుంది. అక్కడ నిలబడి చూసేవారికి నది వెనక్కి ప్రవహిస్తున్నట్లు అనిపించడంతో దీనికి "వెనక్కి ప్రవహించే యమున" అనే పేరు వచ్చింది.
రాజు నిర్మించిన కట్టడా నికి కారణమా?
ఈ నది మలుపు వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. స్థానిక ఆధారాలు, నివేధికల ప్రకారం.. భదావర్ రాజవంశానికి చెందిన రాజు బదన్ సింగ్ కాలంలో యమునా నది ప్రవాహాన్ని ఇక్కడున్న దేవాలయాల పాదాలను తాకేలా మళ్లించేందుకు సుమారు ఒక 'కోసు' పొడవైన అర్ధచంద్రాకార రాతి కట్టను నిర్మించారు.దీని కారణంగా నది వెనక్కి ప్రవహిస్తుందని స్థానికులు నమ్ముతారు.
అయితే ఈ కట్ట వల్ల మాత్రమే నది ప్రవాహం మారిందని చెప్పలేం. నది సహజమైన భౌగోళిక ఆకృతి, అక్కడి భూభాగం, చారిత్రక నిర్మాణం—ఇవన్నీ కలిసి బటేశ్వర్ వద్ద ఒక అర్ధచంద్రాకారపు మలుపును ఏర్పరిచాయి.