దేవుడి గదిలో మట్టి కుండ, రాతి ఉప్పు పెట్టి చూడండి... కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు

Published : Sep 17, 2026, 06:27 PM IST

ఇంట్లోని దేవుడి గదిలో కల్లుప్పు, ఎర్రటి వస్త్రంతో ఉన్న చిన్న మట్టి కుండను చాలా మంది పెడుతూ ఉంటారు. ఇలా ఎందుకు పెట్టారు అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద కారణమే ఉంది.

PREV
13
దేవుడి గదిలో మట్టికుండ, రాతి ఉప్పు ఎందుకు?

దేవుడి గదిలో మట్టికుండ, రాతి ఉప్పు, ఎర్రటి వస్త్రంలో నాణాలు వంటివి పెట్టడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. కొంతమందికి ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవదు. అనవసర ఖర్చులు విపరీతగా పెరుగుతాయి. ఆ సమస్యలు తీరడానికి స్వామీజీలు చెప్పిన పవర్‌ఫుల్ వాస్తు పరిహారమే ఇది. ఇందులో వాడే ప్రతి వస్తువుకూ పంచభూతాలతో సంబంధం ఉంది.

మట్టి కుండ: ఇది 'భూమి తత్వాన్ని' ఆకర్షించి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.

కల్లుప్పు: లక్ష్మీదేవి స్వరూపమైన కల్లుప్పు.. ఇంటికి పట్టిన చెడు దృష్టిని, నెగెటివ్ ఎనర్జీని తరిమికొడుతుంది.

ఎర్రటి వస్త్రం & నాణేలు: ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. నాణేలు డబ్బును ఆకర్షిస్తాయి.

23
పరిహారానికి కావాల్సిన వస్తువులు

ఒక చిన్న మట్టి కుండ
పసుపు, కుంకుమ, గంధం
జవ్వాది పౌడర్ (పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది)
కల్లుప్పు (దొడ్డు ఉప్పు)
ఒక చిన్న ఎర్రటి వస్త్రం
11 నాణేలు (కాయిన్స్)
5 లవంగాలు

33
తయారు చేసే విధానం

కుండ తయారీ: మట్టి కుండను శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. పసుపు, గంధం కలిపి కుండ బయట పూయండి. 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి.

లోపల వేయాల్సినవి: కుండలో కొద్దిగా పసుపు, కుంకుమ, సువాసన ఇచ్చే జవ్వాది పౌడర్ వేయండి. ఆ తర్వాత పావు వంతు కల్లుప్పు నింపండి.

11 నాణేల రహస్యం: ఒక చిన్న ఎర్రటి వస్త్రంలో 11 నాణేలు పెట్టి మూట కట్టండి. దాన్ని కుండలోని కల్లుప్పు మధ్యలో పెట్టండి.

లవంగాల వాడకం: ఆ మూటపై మళ్లీ కొద్దిగా కల్లుప్పు వేసి కప్పేయండి. దాని పైన 5 లవంగాలు పెట్టండి.

పూజ: ఈ కుండను దేవుడి గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసి ధూప దీపాలతో భక్తిగా పూజ చేయండి.

ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది. శుభ ఫలితాలు వస్తాయి. ప్రతి పౌర్ణమికి కుండలో ఉన్న కల్లుప్పు, 5 లవంగాలను మాత్రమే మార్చండి (పాత ఉప్పును నీళ్లలో కరిగించి బయట పారబోయండి). ఎర్రటి వస్త్రంలో ఉన్న 11 నాణేలను మాత్రం అలాగే ఉంచండి.

మీకు ప్రతి నెలా జీతం రాగానే, ఆ డబ్బును ముందుగా ఈ కుండపై పెట్టి లక్ష్మీదేవికి దండం పెట్టుకోండి. కనీసం అరగంట పాటు ఆ డబ్బును కుండపైనే ఉంచి, ఆ తర్వాత తీసి వాడుకోండి. ఇలా చేయడం వల్ల డబ్బు వృథా కాదు. అనవసర ఖర్చులు తగ్గి సంపద పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories