జిడ్డు చర్మం ఉన్నవారికి పెరుగుతో చేసిన స్క్రబ్ చాలా మంచిది. ఈ స్క్రబ్ చేయడానికి, పెరుగులో బియ్యం పిండి, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించి, నెమ్మదిగా మసాజ్ చేయాలి. కాసేపు ఆరనిచ్చి, ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
జిడ్డు చర్మం ఉన్నవారు రోజూ ముఖానికి పెరుగును ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, ముఖ సమస్యలు ఉన్నవారికి పెరుగు చాలా మంచిది. పెరుగు చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.