Secret Affairs: పెళ్లయ్యాక రహస్యంగా ఇతరులతో అక్రమ బంధాలు పెట్టుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇందుకో సం ఓ గ్లోబల్ డేటింగ్ యాప్ ను వినియోగిస్తారు. మన దేశంలోనే టాప్ ప్లేస్లో నిలిచింది ఒక సిటీ. ఇంతకీ ఆ నగరం ఏది?
పెళ్లయ్యాక కూడా భార్య భర్తలు వ్యక్తిగత సుఖాల కోసం ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇండియా 'సీక్రెట్ ఎఫైర్' లిస్ట్లో టాప్ స్థానంలో నిలిచింది. రహస్య డేటింగ్ కోసం 'యాష్లే మాడిసన్' యాప్ ను వాడుతూ ఉంటారు. దీని ద్వారా పెళ్లయిన వారు, పెళ్లికాని వారు కూడా ప్రేమికులను వెతుకుతూ ఉంటారు. అయితే దీని వాడకంలో మన దేశంలోని కాంచీపురం నంబర్ వన్ స్థానంలో ఉంది. సంప్రదాయానికి నిలువుటద్దంలా కనిపించే ఈ ఊరిలో ఎంతోమంది అక్రమ సంబంధాల కోసం యాప్ ను వాడతున్నారంటే మన భారతీయుల తీరు ఎంతగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద మెట్రో నగరాల్లో ఇలాంటి యాప్స్ వాడకం కామన్. కానీ కాంచీపురం లాంటి సాంప్రదాయ, సంపన్న వర్గాలు ఉన్నచోట ప్రజలు దీన్ని వాడడం మాత్రం అందరికీ షాకింగ్ గా ఉంది. మరి రెండో స్థానంలో ఉన్న నగరం ఏది? సర్వే ఏం చెబుతోంది?
24
అన్నీ తమిళనాడు నగరాలే
యాష్లే మాడిసన్ సంస్థ మే 2026లో విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, కాంచీపురం నగరం నుంచే ఎక్కువ మంది ఈ యాప్లో సైన్-అప్ అయ్యారు. ఈ ఏడాది కాంచీపురం తర్వాత కోయంబత్తూర్, తిరువళ్లూరు, చెన్నై నగరాలు ఉన్నాయి. ఈ డేటింగ్ యాప్ వాడకంలో తమిళనాడు నగరాలే టాప్ లో ఉన్నాయి.
34
మనదేశం 3వ స్థానంలో
ఈ యాప్ వాడే 20 దేశాల లిస్ట్లో భారత్ ఇప్పుడు మన దేశం 3వ స్థానంలో ఉంది. గత ఏడాది మన దేశం 8వ స్థానంలో ఉండేది. భారతీయుల్లో ఇలాంటి సీక్రెట్ డేటింగ్పై ఆసక్తి పెరుగుతోంది. ఇదే ఏడాది మొదట్లో, పెళ్లి తర్వాత సంబంధాల కోసమే ఉన్న మరో ఫేమస్ డేటింగ్ యాప్ 'గ్లీడెన్' (Gleeden), ఇండియాలో తమ సబ్స్క్రైబర్ల సంఖ్య 40 లక్షలు దాటిందని ప్రకటించింది.
ఈ సర్వేలు, గణాంకాలు చూస్తుంటే ఇండియాలో పెళ్లి, బంధాలపై ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయని అర్థమవుతోంది. ఈ మార్పు కేవలం పెద్ద మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. ఇక్కడి ప్రజలు వ్యక్తిగత స్వేచ్ఛకు, ప్రైవసీకి ఇస్తున్న ప్రాధాన్యతను చూపిస్తోంది. కేవలం మెట్రో నగరాలే కాకుండా, ఇతర ప్రాంతాల నగరాలు కూడా సీక్రెట్ అఫైర్లకు అలవాటు పడుతున్నారు.