1. మినప్పప్పు, మెంతులను కలిపి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టండి.ఇడ్లీ రవ్వ లేదా బియ్యం, అటుకులను కూడా విడిగా నానబెట్టండి.
2. మినప్పప్పును బాగా మెత్తగా, నురుగు వచ్చేలా రుబ్బుకోండి. మెత్తగా రుబ్బిన మినప్పిండిలో రాగి పిండి వేసి కలపండి.
3. ఆ మిశ్రమంలో నానబెట్టి పిండిన ఇడ్లీ రవ్వ/అటుకుల పేస్ట్ వేసి కలపండి. దీనికికల్లుప్పు (రాక్ సాల్ట్) కలిపితే పిండి బాగా పులుస్తుంది.
4. పిండి మరీ పల్చగా ఉండకూడదు, జారుగా ఉండాలి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి వెచ్చని ప్రదేశంలో 8 నుండి 12 గంటల పాటు పులియనివ్వండి.
5. పిండి పులిసిన తర్వాత గరిటెతో వేగంగా కలపకూడదు. లోపలి గాలి బుడగలు పోకుండా నెమ్మదిగా ఒక్కసారి కలపండి.
6. ఇడ్లీ ప్లేట్లలో ఈ మిశ్రమాన్ని వేసి మీడియం ఫ్లేమ్ 10 నుండి 12 నిమిషాలు ఆవిరిపై ఉడికించండి.
7. అంతే టేస్టీ రాగి ఇడ్లీలు మెత్తగా వచ్చేస్తాయి.ఒట్టి రాగి పిండితో చేస్తే ఇడ్లీలు రాయిలా గట్టిగా వస్తాయి. తప్పనిసరిగా మినప్పప్పు, ఇడ్లీ రవ్వ లేదా అటుకులను కలపాలి