మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా తినాలి. సాధారణంగా రోజుకు మూడు పూటలా తింటుంటారు. అయితే తిన్న తర్వాత కొన్ని పనులను చేయొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు భోజనానికి ముందు, తర్వాత ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. భోజనం తర్వాత కొన్ని పనులు చేస్తే.. మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత నడవడం, పొగతాగడం, పండ్లు తినడం, నిద్రపోవడం, వెంటనే లేచి నిలబడకూడదని నిపుణులు సలహానిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే నీరు తాగొద్దని కూడా నిపుణులు చెబుతున్నారు.