డ్రై ఐస్
రోజంతా మొబైల్ ఫోన్ ను చూడటం, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లో ఎక్కువ సేపు పనిచేయడం, టీవీని గంటల కొద్దీ చూడటం వల్ల మన కళ్లపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కళ్లు బలహీనంగా మారతాయి. అలాగే కళ్లు పొడిబారుతాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఉపయోగిస్తున్నప్పుడు.. కనురెప్పలను బ్లింక్ చేయడం మర్చిపోతాం. దీనివల్ల కళ్లు పొడిబారుతాయి. పొడిబారడం వల్ల అంటువ్యాధులు, ఇతర సమస్యలు కూడా వస్తాయి.
ఎలా నివారించాలి: దీనికోసం పని మధ్యలో ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్లపాటు మీ కళ్ళను రిలాక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే గాడ్జెట్లను దూరంగా ఉంచండి. అలాగే మీ కళ్లను ఆర్పడం మర్చిపోకూడదు. మొబైల్ లేదా ల్యాప్ టాప్ బ్రైట్ నెస్ ను తగ్గించి ఉపయోగించడం మంచిది.