కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది
కండరాలు, కీళ్లకు సంబంధించిన సమస్యలను తొలగించడానికి కూడా ఆవనూనె ఉపయోగపడుతుంది. ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. క్రమం తప్పకుండా ఆవనూనెతో ఎముకలు, కండరాలు, కీళ్లకు బాగా మసాజ్ చేస్తే ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు ఎముకలను బలంగా ఉంచడానికి మీరు దీనిని ఉపయోగించవచ్చు.