వెంటనే నీరు తాగడం
పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా పండ్లను తిన్న వెంటనే నీళ్లను తాగడం చూసే ఉంటారు. నిజానికి పండ్లను తిన్న వెంటనే నీళ్లను తాగకూడదు. ఎందుకంటే పండ్లు తిన్న తర్వాత నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పిహెచ్ స్థాయి అసమతుల్యంగా మారుతుంది. ముఖ్యంగా పుచ్చకాయ, మస్క్ మెలోన్, దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పండ్లను తిన్న తర్వాత నీళ్లను తాగకూడదు. ఎందుకంటే ఎక్కువ నీరున్న పండు మీ కడుపు ఆమ్లతను తగ్గించడం ద్వారా పిహెచ్ సమతుల్యతను మారుస్తుంది. ఇలా చేయడం వల్ల డయేరియా, కలరా వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.