చలికాలంలో మసాలా టీ తాగితే శరీరం వెచ్చగా ఉంటుంది. అంతేకాదు ఇది కూల్ వెదర్ ను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ మసాలా టీ ని దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ, కుంకుమపువ్వు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేస్తారు. ఈ సుగంధ ద్రవ్యాలు మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, జీవక్రియను పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అల్లం టీ, దాల్చినచెక్క టీతో సహా ఎన్నో రకాల మసాలా టీను ఈ సీజన్ లో తాగొచ్చు. ఈ మసాలా టీని ఒకే మసాలా లేదా వివిధ మసాలా దినుసుల కలయికతో తయారు చేస్తారు.