ద్రాక్ష పండ్ల ద్వారా మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఈ పండ్లలో విటమిన్ బి, రాగి, జింక్, ఇనుము, కార్భోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు, పొటాషియం, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, కెరోటిన్ , విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా తగ్గుతుంది.