చలికాలంలో పైల్స్ సమస్య ఎక్కువవుతుంది.. ఈ పోషకాహారం తింటే బెటర్..

First Published Dec 22, 2022, 3:02 PM IST

పైల్స్ సమస్య వల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. అయితే ఈ పైల్స్ చలికాలంలో మరింత ఎక్కువ అవుతాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. 
 

పైల్స్ ను హేమోరాయిడ్స్ అని అర్షమొలలు అని కూడా అంటుంటారు. ఈ పైల్స్  వల్ల పురీషనాళం చుట్టూర రక్తనాళాలు బాగా విస్తరిస్తాయి. అంతేకాదు ఈ రక్తనాళాలు బాగా ఉబ్బుతాయి. ఈ పైల్స్ మలద్వారం లోపల ఉంటాయి. సాధారణంగా ఇవి మూత్రానికి వెళ్లినప్పుడు లేదా మలవిసర్జన చేసేటప్పుడు బయటకు పిలకల్లా వస్తుంటాయి. అదికూడా ఒత్తిడి తెస్తే.. అయితే ఈ సమస్య మరింత పెద్దదిగా మారితే మాత్రం ఇవి ఎప్పుడూ బయటే ఉంటాయి. దీనివల్ల కూర్చోవడానికి, నడవడానికి, పడుకోవడానికి కూడా  ఇబ్బందిగానే ఉంటుంది. పైల్స్ వల్ల విపరీతమైన నొప్పి పడుతుంది. వీటివల్ల పాయువు చుట్టూ బాగా దురద పెడుతుంది.  రక్తస్రావం కూడా అవుతుంది. భరించలేని నొప్పి కలిగితే మాత్రం చికిత్స తప్పకుండా తీసుకోవాలి. అయితే పైల్స్ పేషెంట్లు చలికాలంలో మిరింత ఇబ్బందికి గురికావొచ్చు. 
 

piles

పైల్స్ నుంచి ఎలా ఉపశమనం పొందాలి? 

చలికాలంలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతుంటాయి. దీనివల్ల రక్తనాళాలు బాగా కుంచించుకుపోతాయి. దీంతో రక్తప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుంది. పైల్స్ తో బాధపడేవాళ్లు తీవ్రమైన లక్షణాలతో ఇబ్బంది పడితే మాత్రం దానికి ఎంతో శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే.. 
 

fiber

ఫైబర్ కంటెంట్  ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి

ఫైబర్ మన జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. ఫైబర్ పేగు కదలికలను కూడా నియంత్రిస్తుంది. దీంతో పైల్స్ సమస్యలు కూడా కొంతవరకు తగ్గుతాయి. పైల్స్ వల్ల పేగు కదలికలు జరిగి రక్తస్రావం జరుగుతుంది. ఫైబర్ కంటెంట్ వల్ల మృదువైన ప్రేగు కదలికకు సహాయపడుతుంది. ఇది పైల్స్ నొప్పిని, అసౌకర్యాన్ని, రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. ఇందుకోసం మీ రోజు వారి ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. 

పీచుపదార్థాలు, పండ్లు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, కూరగాయలను ఎక్కువగా తినాలి. ముఖ్యంగా పైల్స్ ఉన్నవాళ్లు నీటిని పుష్కలంగా తాగాల్సి ఉంటుంది. 
 

fiber

పైల్స్ సమస్యతో బాధపడేవారు కారం ఎక్కువగా ఉండే  ఆహారాలను అసలే తినకూడదు. ఎందుకంటే ఇవి జీర్ణక్రియను పాడుచేయడమే కాకుండా.. పేగు కదలికల మార్గంలో ఇబ్బందిని కలిగిస్తాయి కూడా. ముఖ్యంగా ఎండు మిర్చిని తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే ఇది పేగులకు అంటుకోవడం వల్ల చికాకు పెరుగుతుంది. అందుకే మీ ఆహారంలో కారం తక్కువగా ఉండేట్టు చూసుకోండి. అలాగే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కు దూరంగా ఉండండి. అప్పుడే సమస్య తగ్గుతుంది. 

ప్రయాణాలు చేసేవారు మూత్రాన్ని, మల విసర్జనను ఆపుతుంటారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. దీనివల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మూత్రాన్ని పట్టి ఉంచడం వల్ల మూత్రాశయం దెబ్బతింటుంది. పైల్స్ సమస్య ఉన్నవారు వీటిని అసలే ఆపకూడదు. ఈ సమస్య ఉన్నవాళ్లకు మలకండరాలు చాలా వదులుగా ఉంటాయి. ఇది మీకు అసౌకర్యాన్ని పెంచుతుంది.  

click me!