కోరా పసుపు ఫేస్ మాస్క్...
బాణలిలో వేయించిన పసుపు, తేనె, రోజ్ వాటర్ కలిపి తయారు చేసే ఫేస్ ప్యాక్ ఇది. దీనిని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తే చాలు.. ముఖానికి మంచి గ్లో వస్తుందని వైరల్ వీడియోలో చెప్పారు. ఇంట్లో ఉండే తక్కువ ఖర్చు పదార్థాలతో, మన పాతకాలపు పద్ధతుల్లో ఉండేలా అనిపించడంతో ఈ చిట్కా అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ మాస్క్ ఎలా తయారు చేయాలి?
కావాల్సిన పదార్థాలు:
వేయించిన పసుపు – 1 స్పూన్
తేనె – 1 స్పూన్
రోజ్ వాటర్ – 1 నుండి 2 స్పూన్లు
చేసే విధానం:
ముందుగా పసుపును బాణలిలో పొడిగా వేయించి, పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన పసుపులో తేనె వేసి, ఆపై పేస్ట్లా అయ్యేంత వరకు కొద్దికొద్దిగా రోజ్ వాటర్ పోస్తూ కలపాలి. ముఖం కడుక్కున్నాక, కళ్లు పెదవుల చుట్టూ తప్పించి మిగతా ముఖమంతటా పల్చగా అప్లై చేయాలి. కొద్దిసేపు ఉంచుకుని తర్వాత, గోరువెచ్చని నీటితో కడిగేయాలి.