ప్రస్తుత కాలంలో మన దేశంలో డయాబెటీస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే చికిత్స ఇంకా అందుబాటులో లేదు. అందుకే దీని బారిన పడితే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడాలి. అయితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఆహారమే కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహులు తినే ఆహారం, శరీర బరువు, జీవనశైలి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. కొవ్వు , కేలరీలు తక్కువగా ఉండి.. ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం డయాబెటీస్ ను నియంత్రించడంలో సహాయపడతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.