sankranthi 2022 : సంక్రాంతికే పతంగులను ఎందుకు ఎగరేస్తరో తెలుసా..?

Published : Jan 13, 2022, 07:12 PM ISTUpdated : Jan 13, 2022, 07:35 PM IST

 sankranti 2022 : సంక్రాంతి పండుగ రోజున చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా గాలి పటాలను ఎగరేస్తుంటారు. మరి గాలిపటాలను మనం ఎప్పటి నుంచి ఎగరేస్తుంన్నాం. ఎక్కడి నుంచి ఈ సాంప్రదాయం పుట్టుకొచ్చింది అనే విషయాలు చాలా తక్కువ మందికే తెలుసు. గాలి పటాలు ఎగరేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

PREV
14
sankranthi 2022 : సంక్రాంతికే పతంగులను ఎందుకు ఎగరేస్తరో తెలుసా..?

sankranti 2022 : సంక్రాంతి ఎన్నో సంతోషాలను మూటగట్టుకొస్తుంది. కొత్త అల్లుల్లతో, కోడి పందేలతో, ఇంటి నిండా చుట్టాలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు.  ఇక ఈ పండుగలో స్పెషల్ అంటే పిండి వంటలు, గొబ్బెమ్మలు, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు. ఇక వీటితో పాటుగా గాలిపటాల సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతి పండగ రాకముందు నుంచే ఈ పతంగుల జాతర  మొదలవుతుంది. ఇక పండగ రోజు పిల్లలు.. పెద్దలు అంటూ తేడా లేకుండా రకరకాల గాలిపటాలు తెచ్చుకుని పోటీలు పెట్టుకుని మరీ ఎగరేస్తూ మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. సంక్రాంతికి గాలి పటాలు ఎగరేస్తారు అనేది అందరికీ తెలుసు.. కానీ ఎందుకు ఈ పండగకే ఎగరేస్తారు.. ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందని ఎవవరికైనా తెలుసా..? పదండి ఈ ఆర్టికల్ చదివి పతంగుల పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకుందాం.
 

24

పతంగులను మొదటి సారిగా చైనాలో ఎగరవేసారు. సుమారుగా 2000 ఏండ్ల కిందట అక్కడే ఎగరేసారట. అయితే సరదా కోసం కాకుండా ఆత్మ రక్షణ కోసం ఈ పతంగులను ఎగరవేసేవారని సమాచారం. కాగా ఎవరికైనా Information ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఈ గాలిపటాలను ఉపయోగించేవారు. అప్పట్లో కేవలం వీటిని సమాచారాన్ని చేరవేసేందుకే use చేసేవారు. ముఖ్యంగా వీటిని మిలటరీ నే ఎక్కువగా ఉపయోగించేందట. అయితే అప్పటి గాలి పటాలు ఇప్పటిలా పల్చగా కాకుండా దీర్ఘచతురస్ర ఆకారంలో చాలా మందంగా ఉండేవి. 

34

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. క్రీ. పూ. 206 లో చైనాలోని హేన్ రాజుల చరిత్రకు గాలి పటానికి దగ్గర సంబంధం ఉందని చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ హేన్ రాజుల చరిత్ర మొదలు కావడానికి అసలు కారణం గాలిపటమేనంటూ కథలు కథలుగా చెబుతున్నారు.  హేన్ చక్రవర్తి ఓ కోటను స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేశారట. దానికోసం ఆ కోట ఎంత పొడవుందో తెలుసుకోవడానికి గాలిపటాన్ని ఉపయోగించారు. ఆ గాలిపటం సాయంతో ఆ కోట పొడవెంతో తెలుసుకుని.. అంత పొడవు సొరంగాన్ని తవ్వించారు.

44

 ఆ తర్వాత తన సైన్యంతో కలిసి ఆ కోటను స్వాధీనం చేసుకున్నారని విశ్లేషకులు చెబుతన్నారు. ఇక సంక్రాంతి పండుగ రోజున గాలిపటాలను ఎగరవేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావని ఈ సంప్రాదాయం వచ్చిందట. పొద్దు పొద్దున్న ఎండలో నిలబడి పతంగులను ఎగరేయడం వల్ల శరీరం పై సూర్య కిరణాలు నేరుగా పడి డీ విటమిన్ లభిస్తుంది. అలాగే చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయని . శరీరంపై ఉండే బ్యాక్టీరియా నశిస్తుందని ఆయుర్వేదపంగా తెలుస్తుంది.   

Read more Photos on
click me!

Recommended Stories