ఈ రోజున పితృదేవతారాధన చేయడంతో వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు చెబుతున్నారు. సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్ర్యం (Poverty), బాధలు (Suffering) తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. స్త్రీలు సంక్రాంతి రోజున పువ్వులు, పసుపు, కుంకుమ, బెల్లం, పండ్లను దానం చేస్తే సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం కలుగుతుందని విశ్వాసం.