మధుమేహులు ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయట..

Published : Oct 08, 2022, 09:41 AM ISTUpdated : Oct 08, 2022, 09:43 AM IST

షుగర్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయిలను మెయింటైన్ చేయడమనేది కష్టంతో కూడుకున్న పని. డైలీ హెల్తీ డైట్ ను తీసుకుంటూ.. కొంత సేపు వర్కౌట్స్ చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.   

PREV
16
మధుమేహులు ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయట..

ఈ రోజుల్లో షుగర్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వన్స్ ఈ మధుమేహం బారిన పడ్డారంటే లైఫ్ స్టైల్ ను పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. ఏవి పడితే అవి తినకూడదు. ముఖ్యంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.  అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి.  లేకపోతే ఆరోగ్యం దెబ్బతిని గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఉదయం లేవగానే షుగర్ పేషెంట్లు కొన్ని పనులను చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26

నీళ్లను తాగాలి

ఉదయం లేవగానే గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. మీ పేగులను కూడా శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు ఇలా ఉదయం లేవగానే గ్లాస్ నీళ్లను తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగే అవకాశం తగ్గుతుంది. 
 

36
morning walking

మార్నింగ్ వాక్

షుగర్ పేషెంట్లకు మార్నింగ్ వాక్ చాలా అవసరం. ఈ నడక వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. అలాగే బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. మార్నింగ్ వాక్ గొప్ప వ్యాయామం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది శరీరం సక్రమంగా పనిచేసేలా చేయడమే కాదు ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తుంది.
 

46

బ్లడ్ షుగర్ టెస్ట్

షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ ఉదయం లేవగానే రక్తంలో చక్కెర స్థాయిలను టెస్ట్ చేసుకోవాలి. ఇందుకోసం మార్కెట్ లల్లో గ్లూకోమీటర్లు ఉంటాయి. దీని సాయంతో ఇంటివద్ద మీరే టెస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. 
 

56

హెల్తీ బ్రేక్ ఫాస్ట్

కొంతమంది బ్రేక్ ఫాస్ట్ లో అన్నాన్ని తింటే మరికొందరు మాత్రం రకరకాల టిఫిన్స్ ను తింటుంటారు. ఇంకొందరు బరువు పెరుగుతామనో.. టైం లేకనో మొత్తానికే బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. నిజానికి బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం అస్సలు  మంచిది కాదు. ఉదయం పూట మీ ఆరోగ్యానికి మంచి చేసే ఆరోగ్యకరమైన ఆహారాలనే తినండి. ఆయిలీ ఫుడ్స్ ను, తీపి పదార్థాలను అస్సలు తినకండి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. 

66

పాదాలను చూడండి

షుగర్ వ్యాధి  కూడా పాదాల సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఉదయం నిద్రలేవగానే పాదాలను చూడండి. పాదాలు కానీ.. పాదాల గోర్ల రంగు గానీ మారినట్టైనా.. లేదా పాదాలపై ఏవైనా బొబ్బలు, గాయాలు గుర్తున్నా వెంటనే డాక్టర్ దగ్గరకు వెల్లడం మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories