మధుమేహులు గోధుమ రొట్టెలకు బదులుగా.. ఈ పిండితో చేసిన రొట్టెలు తిన్నా షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ లో ఉంటాయి..

Published : Oct 23, 2022, 11:05 AM IST

మధుమేహులు గోధుమ పిండి రొట్టెలనే ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఇదొక్కటే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని నమ్ముతారు. నిజానికి డయాబెటీస్ రోగులకు కొన్ని రకాల పిండులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. 

PREV
16
మధుమేహులు గోధుమ రొట్టెలకు బదులుగా.. ఈ పిండితో చేసిన రొట్టెలు తిన్నా షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ లో ఉంటాయి..

ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల సంఖ్య దారుణంగా పెరిగిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతే వీళ్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. ముఖ్యంగా దీనివల్ల మూత్రపిండాల వ్యాధి వస్తుంది. గుండెపోటు ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ షుగర్ వ్యాధి కొంత మందికి చెడు ఆహారాలు, లైఫ్ స్టైల్ వల్ల వస్తే, ఇంకొంత మందికి మాత్రం జన్యుపరంగా వస్తుంటుంది. షుగర్ పేషెంట్లు అన్నానికి బదులుగా గోధుమ రొట్టెలనే ఎక్కువగా తింటుంటారు. ఎందుకంటే అన్నం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. రొట్టె అయితే అలా కాదు. మధుమేహులు ఒక్క గోధుమ రొట్టెలనే కాదు.. వేరే పిండి తో చేసిన రొట్టెలు కూడా తినొచ్చు. ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అవేంటంటే.. 
 

26

సాధారణంగా.. మనలో చాలా మంది గోధుమ రొట్టెలనే ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లైతే.. అన్నానికి కంటే ఈ రొట్టెలను ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అయితే తృణధాన్యాల పిండితో చేసిన రొట్టెలను కూడా మధుమేహులు తినొచ్చు. ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహులు ఎలాంటి పిండితో చేసిన రొట్టెలను తినొచ్చో తెలుసుకుందాం పదండి. 

36

బార్లీ పిండి

మధుమేహులు ప్రతిరోజూ గోధుమ పిండిని తింటూ ఉంటారు. వీటిని తిన్నా పెద్దగా నష్టమేమీ జరగదు. కానీ వీటికి బదులుగా బార్లీ పిండిని కూడా తినొచ్చు. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. 
 

46

రాగుల పిండి

రాగులను మధుమేహులు తప్పకుండా తినాల్సిన ఆహారం తెలుసా.. ఎందుకంటే వీటిలో పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే ముఖ్యమైన ఖనిజాలు, అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఈ పిండి కూడా చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతాయి. 
 

56

మన పెద్దలు ఒక్కువగా జొన్న పిండితో చేసిన రొట్టెలనే ఎక్కువగా తినేవారు. అందుకే వాళ్లు అంత బలంగా ఉండేవారు.  ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్, మెగ్నీషియం కూడా ఈ పిండిలో ఉంటాయి. షుగర్ పేషెంట్లకు ఈ పిండితో చేసిన రొట్టెలు ప్రమయోజనకరంగా ఉంటాయి. ఈ పిండితో చేసిన రొట్టెలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే ఉండదు. 

66

శెనగ పిండి

శెనగ పిండిని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. అయితే మీరెప్పుడైనా శెనగపిండితో తయారుచేసిన రొట్టెలను తిన్నారా? ఈ రొట్టెలు షుగర్ పేషెంట్లకు ఔషదం లాంటిది తెలుసా.. ఎందుకంటే ఈ రొట్టెలు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. 
           

Read more Photos on
click me!

Recommended Stories