ఈ రోజుల్లో తలనొప్పి సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఆకలి, అలసట, స్ట్రెస్, జలుబు వంటి ఎన్నో కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి కొన్ని ప్రమాదకరమై వ్యాధులకు సంకేతం కూడా. అందుకే తలనొప్పి విపరీతంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. ఇకపోతే అప్పుడప్పుడు వచ్చే తలనొప్పిని తగ్గించుకునేందుకు మనమందరం ట్యాబ్లెట్లను వాడుతుంటాం. కానీ ఇలా తలనొప్పి వచ్చిన ప్రతిసారీ ట్యాబ్లెట్ ను వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.