Cracked Heels: ఇదొక్కటి పెట్టినా మడమల పగుళ్లు తగ్గుతాయి

Published : Sep 16, 2025, 04:20 PM IST

Cracked Heels: చాలా మందికి వర్షాకాలంలో మడమలు పగుళుతుంటాయి. ఇది చిన్న సమస్యే అయినా దీనివల్ల నడవడానికి ఇబ్బంది అవుతుంది. ఈ పగుళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి నుంచి రక్తం కూడా వస్తుంది. అందుకే వీటిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

PREV
17
మడమల పగుళ్లు

మడమలు పగుళ్లు అందరికీ వచ్చే కామన్ ప్రాబ్లం. ఈ సమస్య ఎండకాలంలోనే కాదు వానాకాలంలో కూడా చాలా మందికి వస్తుంటుంది. దీనివల్ల పాదాలు బాగా నొప్పి ఉంటాయి. ఈ నొప్పితో నడవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ఈ మడమల పగుళ్లను చాలా తొందరగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

27
గోరువెచ్చని నీళ్లు

ఇది చాలా సింపుల్ చిట్కా. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఒక బకెట్ లో గోరువెచ్చని నీళ్లు పోయండి. దీనిలో షవర్ జెల్ వేసి మీ పాదాలను అందులో 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టండి. తర్వాత మీ పాదాలను రుద్ది క్లీన్ చేయండి. తర్వాత నార్మల్ వాటర్ తో కడిగి టవల్ తో తుడవండి. తర్వాత మాయిశ్చరైజర్ ను పెట్టండి. దీనివల్ల పాదాల పగుళ్లు క్రమంగా తగ్గుతాయి. 

37
తేనె

తేనె కూడా  పాదాల పగుళ్లను తగ్గించడానికి సహాయపడుతుంది. తేనే నేచురల్ యాంటీసెప్టిక్. కాబట్టి  ఇది పగుళ్లను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచే్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీళ్లలో కొంచెం తేనె కలిపి మీ పాదాలను అందులో 20 నిమిషాలు నానబెట్టండి. లేదా మీరు పడుకునే టప్పుడు నేరుగా పగుళ్లకు కూడా తేనెను అప్లై చేయొచ్చు. 

47
కొబ్బరి నూనె

కొబ్బరి నూనె కూడా మడమల పగుళ్లను తగ్గించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే తేమ లక్షణాలు పగుళ్లను తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం ప్రతిరోజూ రాత్రిపూట పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి కొబ్బరి నూనె పెట్టి కాసేపు మసాజ్ చేయండి. ఇలా రోజూ చేస్తే పాదాల వాపు, నొప్పి, పగుళ్లు తగ్గుతాయి. అలాగే పాదాల చర్మం స్మూత్ గా అవుతుంది.

57
అరటిపండు, వెన్న

అరటిపండు, వెన్నతో మడమల పగుళ్లను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం బాగా పండిన అరటిపండులో వెన్న వేసి పేస్ట్ చేయండి. దీన్ని శుభ్రంగా కడిగిన పాదాలకు పట్టించి కొద్దిసేపు మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. 

67
వ్యాసెలిన్, నిమ్మరసం

మడమల పగుళ్లను నిమ్మరసం, వాసెలిన్ తో కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం వాసెలిన్ లో నిమ్మరసం కలిపి రాత్రిపూట నిద్రపోయే ముందు మడమలకు పెట్టండి. మరుసటి రోజు గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. నిమ్మలోని ఆమ్ల గుణాలు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. వాసెలిన్ పాదాల చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది.

77
ఓట్స్

ఓట్స్ మడమల పగుళ్లను తగ్గించుకోవడానికి మంచి స్క్రబ్ లాగ పనిచేస్తుంది. ఇందుకోసం టీ స్పూన్ ఓట్స్ పొడిలో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ చేయండి. దీన్ని మడమలకు పట్టించి కాసేపు మసాజ్ చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడగండి. ఇది మడమలను తగ్గించి చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories