ఒక అధ్యయనం ప్రకారం.. మధ్యాహ్నం 20 నిమిషాల పాటు ఒక చిన్న కునుకు తీయడం వల్ల ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా పెరుగుతుందట. ఇంగ్లాండ్ లోని లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మధ్యాహ్నం 20 నిమిషాలు నిద్రపోవడం వల్ల మధుమేహం, గుండె సమస్యలు, నిరాశ వంటి సమస్యలను కూడా తగ్గిపోతాయట.