చాణక్య నీతి లేదా కౌటిల్య నీతి రాసింది అపర చాణక్యుడు.ఇతడిని విష్ణు గుప్తుడు అని కూడా పిలుస్తారు. ఇతడిని మంచి దౌత్యవేత్తగా, ఆర్థికవేత్తగా ఆయనకి గొప్ప పేరు చరిత్రలో మిగిలిపోయింది. శతాబ్దాల క్రితం ఆయన రాసిన చాణక్యనీతి ఇప్పటికీ సందర్భానికి తగ్గట్టు చెప్పుకుంటూనే ఉంటాము. మానవ స్వభావాన్ని చాలా పరిశీలన చేసి అధ్యయనం చేసిన వ్యక్తి చాణక్యుడు. అందుకే ఎలాంటి వ్యక్తులు విజయవంతమవుతారు, ఎలాంటి వ్యక్తులు చెడిపోతారు, ఎలాంటి లక్షణాలు మనిషిని గొప్ప వాడిని చేస్తాయో.. ముందుగానే రాసి పెట్టారు. అలాగే స్త్రీలు.. పురుషులకంటే ఏ విషయాల్లో ఉన్నతంగా ఆలోచిస్తారో, ఉన్నతంగా పనిచేస్తారో కూడా ఆయన చెప్పారు. ఆచార్య చాణక్యుడు ప్రకారం స్త్రీలలో ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు చాలా గొప్పవి. మగవాడు కోరుకున్నా కూడా అవి వారికి రావు. కొన్ని విషయాల్లో స్త్రీల ముందు మగవారు ఎందుకు పనికిరారు? ఆ అంశాలు ఏమిటో తెలుసుకుందాం.