ఆయుర్వేదం ప్రకారం.. పండ్లను బ్రేక్ ఫాస్ట్ లో అస్సలు తినకూడదు.. ఎందుకంటే?

Published : Dec 13, 2022, 11:59 AM IST

పండ్ల ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా అందుతాయి. ఇవే మనల్ని హెల్తీగా ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం.. పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే.. 

PREV
15
 ఆయుర్వేదం ప్రకారం.. పండ్లను బ్రేక్ ఫాస్ట్ లో అస్సలు తినకూడదు.. ఎందుకంటే?
fruits

కూరగాయల మాదిరిగానే పండ్లు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, సెలీనియం,  పొటాషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను, ఊపిరితిత్తులను, జీర్ణాశయాన్ని, మూత్రపిండాలను, కండ్లతో సహా.. శరీరంలోని మొత్తం శరీర భాగాలను హెల్తీగా ఉంచుతాయి. అందుకే ప్రతిరోజూ రెండు మూడు రకాల పండ్లనైనా తినాలని డాక్టర్లు  ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా సీజనల్ పండ్లను మిస్ కాకుండా తినాలి. ఆయుర్వేదం ప్రకారం.. ఖాళీ కడుపుతో పండ్లను అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఉదయం 6 నుంచి 10 గంటల సమయంలో కఫం ఎక్కువగా ఉంటుంది.  

25

ఆయుర్వేదం ప్రకారం.. తీపి పండ్లు, పుల్లని పండ్లు, ఇతర రుచుల్లో ఉండే పండ్లు పచ్చిగా, చల్లగా ఉంటాయి. పండ్లలో సాధారణంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి ఫాస్ట్ గా జీర్ణమవుతాయి. పండ్లు కఫ మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే ఇవి కఫను మరింత ఎక్కువ చేస్తాయి. పరిగడుపున పండ్లను తినేటప్పుడు కొన్ని సమస్యలకు దారితీస్తాయి.

35

బ్రేక్ ఫాస్ట్ లో పండ్లను తినొద్దనడానికి ప్రధాన కారణం.. జీర్ణశయంలో వేడి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పండ్లను తింటే అది మరింత చల్లగా మారుతుంది. నిజానికి పండ్లు చల్లగా ఉంటాయి. అందుకే  అల్పాహారంలో ఎలాంటి పండ్లను తినకూడదంటారు. 
 

45

మీరు తినే బ్రేక్ ఫాస్ట్ లో వెచ్చగా సులువుగా జీర్ణం అయ్యేటట్టు ఉండాలని డాక్టర్లు సలహానిస్తున్నారు. ఉదాహరణకు బియ్యం గంజి లేదా దాలియా వంటి వండిన ధాన్యాలలో జీలకర్ర వంటి జీర్ణ సుగంధ ద్రవ్యాలు లేదా చిటికెడు శొంటి పొడివేసిన ఒక గ్లాసు కాచిన పాలను తాగండి. 
 

55

అయితే ఇక్కడే ఒక డౌట్ వస్తుంది. మేము చాలా ఏండ్ల నుంచి తింటున్నము. అయినా మాకు ఎలాంటి సమస్యలు రాలేదు కదా అంటుంటారు. నిజానికి ఉదయం పండ్లను తినే అలవాటున్న వారితో పోల్చితే... తినని వారికే బలమైన జీర్ణ వ్యవస్థ ఉంటుంది. జీర్ణవ్యవస్థ ఉష్ణోగ్రత బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉష్ణమండల ప్రదేశంలో నివసించే, శారీరకంగా చురుకుగా ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. 

ఉదయం పండ్లను తినకుండా ఉండలేను అనుకుంటే దాల్చినచెక్క లేదా శొంఠి వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలను జల్లుకుని తినొచ్చు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పండ్లను తినొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.    

Read more Photos on
click me!

Recommended Stories