Smart Lockdown: మళ్లీ లాక్‌డౌన్! రాత్రి 8 గంటలకే అన్నీ బంద్.. అసలేం జరిగిందంటే.?

Published : Apr 09, 2026, 12:15 PM IST

Smart Lockdown: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణంతో పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ప్రభుత్వం దేశంలో 'స్మార్ట్ లాక్‌డౌన్' ప్రకటించింది.

PREV
15
పాకిస్థాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం: 'స్మార్ట్ లాక్‌డౌన్' అమలు

పాకిస్థాన్‌లో తీవ్రమైన ఇంధన కొరత, ఆర్థిక సంక్షోభం కారణంగా, ప్రభుత్వం ఏప్రిల్ 7, 2026 నుంచి దేశవ్యాప్తంగా 'స్మార్ట్ లాక్‌డౌన్' లాంటి కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఇది కోవిడ్ నాటి పూర్తిస్థాయి లాక్‌డౌన్ కాకపోయినా, కరెంట్, ఇంధనాన్ని ఆదా చేసేందుకు వ్యాపార వేళలపై కఠిన ఆంక్షలు విధించారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో, దిగుమతి చేసుకునే ఇంధన ఖర్చును తగ్గించుకోవడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

25
కొత్త నిబంధనలు ఏంటి?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అన్ని షాపింగ్ మాల్స్, రిటైల్ దుకాణాలు, మార్కెట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలి. రెస్టారెంట్లు, బేకరీలు, కేఫ్‌లు రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు కూడా రాత్రి 10 గంటలలోపు ముగించాలి. ఇంధన వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 4 రోజుల పని, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని సూచించారు. రాత్రిపూట అనవసరమైన వీధి దీపాలు, ప్రకటనల హోర్డింగ్‌లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు.
35
మినహాయింపులు
ఫార్మసీలు (మందుల దుకాణాలు), ఆసుపత్రులు, పాలు, కూరగాయల వంటి నిత్యావసరాలు అమ్మే దుకాణాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్, ఇస్లామాబాద్‌లలో ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రం మార్కెట్లను రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. సింధ్ ప్రావిన్స్‌లో కూడా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు జారీ చేశారు.
45
ఆర్థిక ప్రభావం
పాకిస్థాన్ రూపాయి విలువ పడిపోతున్న ఈ సమయంలో, ఈ 'స్మార్ట్ లాక్‌డౌన్' ద్వారా సుమారు 250 బిలియన్ రూపాయలు ఆదా చేయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే, వ్యాపార వేళలు తగ్గించడం వల్ల చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపార సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా, దేశంలోని అత్యవసర పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు స్థిరపడగానే ఈ ఆంక్షలను సడలిస్తామని, ఇది తాత్కాలిక చర్యేనని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ, విద్యుత్ కోతలు, ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
55
యుద్ధ విరమణతో..

అయితే ప్రస్తుత పరిస్థితులతో పాకిస్థాన్ లో విధించిన లాక్ డౌన్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం యుద్ధ విరమణ జరగడం, శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. దీంతో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories