ఓ వైపు ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిధులు సమకూరడం లేదు. అప్పులిచ్చే వారు దొరకడం లేదు. అయినా పాకిస్థాన్ మేకపోతు గాంభీరం మాత్రం వీడడం లేదు. ప్రస్తుతం పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంట నూనె నుంచి పాలు, పెట్రోల్ వరకు అన్నీ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. లీటరు పాలు రూ. 150, లీటరు నూనె రూ. 500 దాటేసింది. దేశ ఆర్థిక పరిస్థితి ఇంతలా దిగజారితే మరోవైపు పాకిస్థాన్ మాత్రం భారత్ పై ఎదురు దాడికి దిగుతోంది.
భారత్తో ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. గోధుమ పిండి, పప్పులు, బియ్యం మాత్రమే కాదు, పండ్లు, కూరగాయలు, పాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
25
పాకిస్తాన్లో గోధుమపిండి, పప్పు ధరలు
భారత్లో 5 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ దాదాపు రూ. 250 ఉండగా, పాకిస్తాన్లో దాని ధర ప్రస్తుతం రూ. 608 పాకిస్తాన్ రూపాయలుగా ఉంది. Sunridge Pakistan వెబ్సైట్ ప్రకారం, ఒక కిలో శనగపప్పు ధర 380 రూపాయలు, ఒక కిలో శనగపిండి 195 రూపాయలుగా ఉంది.
35
పాకిస్తాన్లో నూనె, పాల ధరలు
Sunridge Pakistan వెబ్సైట్ ప్రకారం, పాకిస్తాన్లో ఒక లీటరు వంట నూనె ధర రూ. 500 కంటే ఎక్కువ. ఒక లీటరు పాలు రూ. 140-150, ఒక కిలో చక్కెర రూ. 175గా ఉంది.
45
పాకిస్తాన్లో పండ్లు, కూరగాయల ధరలు
పాకిస్తాన్లో ఒక కిలో ఆపిల్ ధర రూ. 500 కంటే ఎక్కువ. ఒక కిలో టమాటా రూ. 80. ఆరు గుడ్ల ప్యాకెట్ రూ.145, ఒక క్యారెట్ గుడ్లు (30 గుడ్లు) రూ. 850-920గా ఉంది.
55
పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఎంత?
గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం 25-30% వరకు ఉంది. దేశంపై 125 బిలియన్ డాలర్లకు పైగా అప్పు ఉంది. ప్రతి సంవత్సరం భారీ వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. విదేశీ మారక ద్రవ్యం గత వారం 15.436 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 39.4% జనాభా దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తోంది. దేశం మొత్తం IMF సహాయంపై ఆధారపడి ఉంది.