ఉగ్రమూకలపై వేగంగా ప్రతీకారం తీర్చుకునే టాప్ 5 దేశాలు... భారత్ స్థానమెంత?

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ భారత్ పై ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌ కు తగిన బుద్ది చెప్పేందుకు సిద్దమయ్యింది. ఇలా తమదేశంలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ అలజడికి కారణమవుతున్న శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడంలో చాలా దేశాలు కఠినంగా వ్యవహరిస్తుంటారు... చాలా వేగంగా కౌంటర్ అటాక్ కు దిగుతుంటాయి. ఇలా వెంటనే రియాక్ట్ అయ్యే దేశాలేవి?   భారతదేశం ఏ స్ధానంలో ఉంది? ఇక్కడ తెలుసుకుందాం. 

Top 5 Countries Fastest Revenge on Terrorists in telugu akp
Israel

1. ఇజ్రాయెల్ :

తమ దేశానికి ప్రమాదంగా మారే శత్రువులను ఇజ్రాయెల్ ఏమాత్రం ఉపేక్షించదు. ఎంతటి బలమైన శత్రువులకైనా ధీటుగా సమాధానం చెబుతుంది. ఇలా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రతీకారం తీర్చుకునే దేశంగా ఇజ్రాయెల్ పరిగణించబడుతుంది.

ఇజ్రాయిలే విధానమే 'No Compromise With Terror' (ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోం). 1972 మ్యూనిచ్ ఒలింపిక్ దాడి తర్వాత ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రేత్ ఆఫ్ గాడ్' నిర్వహించింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రీడాా ఈవెంట్ పై దాడికి పాల్పడి క్రీడాకారులు, భద్రతా సిబ్బంది పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఏరివేతకు మాజీ ప్రధాని గోల్డా మెయిర్ ఈ ఆపరేషన్ చేపట్టారు.  

Top 5 Countries Fastest Revenge on Terrorists in telugu akp
America

2. అమెరికా

 అగ్రరాజ్యం అమెరికా కూడా తమ దేశంలో అలజడికి కారణమయ్యే ఉగ్రమూకలపై వెంటనే చర్యలు తీసుకుంటుంది.  ఈ దేేశం 'We Don’t Wait, We Strike' అనే విధానాన్ని అనుసరిస్తుంది. 9/11 దాడికి కారణమైన అల్ ఖైదాను అమెరికా వదిలిపెట్టలేదు... వీరికి ఆశ్రయం కల్పిస్తున్న అఫ్గానిస్తాన్‌లో యుద్ధం చేసింది.


Russia

3. రష్యా

ఉగ్రవాద దాడులకు ప్రతీకారం తీర్చుకోవడంలో రష్యా కూడా అగ్ర దేశాల్లో ఒకటి. దాని సైన్యం చాలా ఖచ్చితమైన మరియు క్రూరమైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటుంది. తమ దేశ రక్షణ విషయంలో రష్యా చాలా ఖచ్చితంగా ఉంటుంది.

France

4. ఫ్రాన్స్

తన దేశంపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడంలో ఫ్రాన్స్ కూడా వెనుకబడి లేదు. 'Immediate Response, Global Message' విధానంపై అది పనిచేస్తుంది.

India

5. భారత్

ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడంలో భారతదేశం అగ్ర దేశాల సరసనే ఉంది. 2016 ఉరి దాడి తర్వాత భారతదేశం సర్జికల్ స్ట్రైక్‌లు నిర్వహించింది. పాకిస్థాన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి విషయంలోనూ భారత్ చాలా గట్టిగా రియాాక్ట్ అవుతోంది. ఈ దాడులవెనక పాక్ హస్తం ఉందని నమ్ముతున్న మోదీ సర్కార్ ఆ దేశ భవిష్యత్ ను అంధకారం చేసే నిర్ణయాలు తీసుకుంది. 

Latest Videos

vuukle one pixel image
click me!