ప్రజల అసంతృప్తి ఎప్పటికప్పుడు దేశాధ్యక్షులను సవాలు చేస్తూ వచ్చింది. కొన్ని ఉద్యమాలు కేవలం ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా, పలు దేశాల రాజకీయ నిర్మాణాన్నే కదిలించాయి. గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక శక్తివంతమైన ఉద్యమాలు చోటుచేసుకుని, పలువురు నేతల రాజీనామాలకు కారణమయ్యాయి. అలాంటి ఉద్యమాలు చూసిన దేశాల లిస్టులో ఇప్పుడు నేపాల్ కూడా చేరింది. ప్రజాగ్రహంతో ప్రభుత్వాలు, నాయకులు కూలిపోయిన టాప్ 10 సంఘటనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బంగ్లాదేశ్ (2024: షేక్ హసీనా)
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానంపై వివక్ష ఉందని విద్యార్థులు నిరసనలు ప్రారంభించారు. ఇది దేశవ్యాప్తంగా హింసాత్మకంగా మారింది. చివరకు ప్రజా ఒత్తిడితో ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి, భారత్లో ఆశ్రయం పొందారు.
2. శ్రీలంక (2022: గోటబయ రాజపక్సే)
ఆర్థిక సంక్షోభం, అవినీతి, దుర్వినియోగం కారణంగా నెలల తరబడి నిరసనలు జరిగాయి. ప్రజలు అధ్యక్ష భవనం, ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించారు. గోటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోగా, మహిందా రాజపక్సే రాజీనామా చేశారు.