జూన్ 13:
ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” ప్రారంభించి ఇరాన్లోని అణు కేంద్రాలు, క్షిపణి అభివృద్ధి స్థావరాలపై దాడులు చేసింది. ఆరుగురు అణు శాస్త్రవేత్తలు మృతి చెందగా, ఇరాన్ “ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3”తో ప్రతీకారం తీర్చింది.
ప్రజలు లక్ష్యంగా – రెండు దేశాలూ దాడులు
జూన్ 14 - 16:
ఇరాన్ దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందగా 76 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హుస్సేన్ తైబ్ హతమయ్యాడు. టెల్అవీవ్లో ఓ భవనం కూలి 9 మంది చనిపోయారు. ఇరాన్ అధికార టీవీ, టెల్అవీవ్, హైఫా ప్రాంతాలు లక్ష్యంగా మారాయి.
జూన్ 17 - 19:
ఇరాన్ పేలుళ్లతో దద్దరిల్లింది. టెహ్రాన్ మొసాద్, మిలిటరీ ఇంటెలిజెన్స్ కేంద్రాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ అరాక్, నతాంజ్ అణు కేంద్రాలు, హాస్పిటళ్లను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ సీనియర్ కమాండర్లు హతమయ్యారు. మృతుల సంఖ్య పెరిగింది.