సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై ఏపీ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల పేరుతో కొందరు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను హై-అలర్ట్ జోన్లుగా ప్రకటించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు.
హై అలర్ట్ జోన్ల గురించి భారత ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ ఎలాంటి ప్రకటన చేయలేదని, ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని, తప్పుడు వార్తలు వైరల్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.