ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి ఎదురైన సవాళ్లు:
2006లో ఎన్వీఎస్ రెడ్డి నగర రవాణా సమస్యల పరిష్కారంగా మెట్రో ప్రాజెక్టును ప్రతిపాదించారు. మెట్రో పథకం ప్రారంభ దశలో మైతాస్ ఫెయిల్యూర్, భూ సమస్యలు, ప్రజా వ్యతిరేకత, ఆస్తిక, పర్యాటక ప్రదేశాలపై అభ్యంతరాలు, రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సమస్యలు వంటి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా కూడా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడంలో టీం నైపుణ్యం, నాయకత్వ నిబద్ధత స్పష్టంగా కనిపించాయని పేర్కొంది.