పాలరాతి శిల్పాలు, భేదాఘాట్: పాలరాతి శిల్పాలు (Marble sculptures), భేదాఘాట్ (Bhedaghat) జబల్ పూర్ అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతం. నర్మదా నదికి అటూ ఇటూ నిలబడి ఈ పాలరాతి శిలలు వందల అడుగుల ఎత్తులో ఉంటాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించిన పర్యాటక ప్రియులకు ప్రశాంతత కలుగుతుంది.
రాణి దుర్గావతి మెమోరియల్ మ్యూజియం: రాణి దుర్గావతి మెమోరియల్ మ్యూజియం (Rani Durgavati Memorial Museum) ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. రాణి దుర్గావతి తన సేవలు జబల్ పూర్, చుట్టుపక్కల ప్రాంతానికి అందించినందుకు ఆమె గుర్తుగా 1964 లో ఈ మ్యూజియం నిర్మించబడింది.
ఈ మ్యూజియం రాచరికపు జీవన విధానం వారి విలాసాల (Luxuries) గురించి పర్యాటకులకు అవగాహన కల్పిస్తుంది. రాణి జీవితాన్ని వివిధ సమయాల్లో ఆమె పాలనను ఈ మ్యూజియం తెలుపుతుంది. ఈ మ్యూజియంలో నాణేలు, శిల్పాలు, యుద్ధ సామానులు, ఆయుధాలు, పుస్తకాలు, చిత్రలేఖనాలు పర్యాటకులకు దర్శనమిస్తాయి.
మదన్ మహల్ ఫోర్ట్: మదన్ మహల్ ఫోర్ట్ (Madan Mahal Fort) లో 11వ శతాబ్దానికి చెందిన జబల్ పూర్ పాలకులు కొన్నేళ్లపాటు నివసించారు. కొండపై ఉన్న ఈ కోట నగరం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటను రాజ మదన్ సింగ్ నిర్మించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ కోట రాణి దుర్గాదేవి సౌరభాన్ని, ఆవిడ పాలనా (Governance) యంత్రాంగాన్ని, సైన్యం గురించి తెలుపుతుంది.
హనుమాన్ తాల్ సరస్సు: జబల్ పూర్ లో ఉన్న హనుమాన్ తాల్ సరస్సు (Hanuman Tal Lake) నగరం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మొత్తం 52 సరస్సులు ఉన్నాయి. అందులో 13 ఎండిపోయాయి. జనాభా పెరగడంతో ఈ సరస్సులు కలుషితం (pollute) అయ్యాయి. ఇది ఒక అందమైన ఆధ్యాత్మిక ప్రాంతం. హనుమంతుల వారు ఈ ప్రాంతంలో అడుగుపెట్టినపుడు ఇక్కడ ఒక సరస్సు ఏర్పడింది అని పురాణాలు చెబుతున్నాయి. అప్పటినుంచి ఈ సరస్సును హనుమాన్ తాల్ గా పిలువబడుతోంది.
సంగ్రామ్ సాగర్ లేక్: జబల్ పూర్ లోని మరొక ముఖ్య ఆకర్షణ ప్రదేశం సంగ్రామ్ సాగర్ లేక్ (Sangram Sagar Lake). ఇది నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. 15వ శతాబ్దంలో గోండ్ రాజు అయిన సంగ్రామ్ షా చే ఈ తటాకము, చుట్టుపక్కల నిర్మాణాలు నిర్మించబడినవి. ఈ లేక్ నీటి జంతువులకు, వలస పక్షులకు ప్రసిద్ధి. ఇక్కడి అందాలు (Beauties) పర్యాటక ప్రియులకు ప్రశాంతతను కలిగించి వారి ఒత్తిడిని తగ్గిస్తాయి.