వ్యాయామం చేయకుండా ఉండేవారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు వైట్ బ్రెడ్, వైట్ వైట్ రైస్, వైట్ ఇడ్లీలు వంటివి ఆహారాలను ఎక్కువగా తీసుకోకూడదు. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ మధుమేహులకు చాలా మంచిది. ఇది వీళ్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బియ్యాన్ని పూర్తిగా మానేయడం కష్టమైతే.. ఒక ప్లేట్ తీసుకుని దాన్ని నాలుగు భాగాలుగా గీతలు గీయండి. వీటిలోఅన్నం ఒక భాగంలో , గుడ్డు, కాయధాన్యాలు లేదా చేపను పెట్టండి. మిగతా భాగాల్లో కూరగాయలు, పండ్లను చేర్చండి. ఇలా చేస్తే మీ మధుమేహం నియంత్రణలో ఉంటుంది.